తెలంగాణ

telangana

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై.. గంగూలీ ఏమన్నారంటే?

By

Published : Sep 16, 2021, 8:33 PM IST

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(virat kohli steps down as indian captain). దీనిపై స్పందించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఉపాధ్యక్షుడు జైషా.

Virat Kohli
కోహ్లీ

టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(virat kohli steps down as indian captain) తప్పుకోనున్నాడు. టీ20 ప్రపంచ కప్‌(t20 world cup 2021 india team) తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. ఇకపై టెస్టు, వన్డే సారథ్య బాధ్యతలపై ఎక్కువగా దృష్టిపెడతానని వెల్లడించాడు. అతడి అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాక్​కు గురయ్యారు. మాజీలు, బోర్డు అధికారులు మాత్రం కోహ్లీ(virat kohli news) నిర్ణయాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(ganguly on kohli captaincy), ఉపాధ్యక్షుడు జై షా కూడా విరాట్​ తప్పుకోవడం పట్ల స్పందించారు.

"కోహ్లీ(ganguly on kohli captaincy) ఎంతో ఆత్మవిశ్వాసంతో భారత జట్టును ముందుకు నడిపించాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా విజయవంతమయ్యాడు. భవిష్యత్​ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్​గా అతడు అందించిన సేవలకు ధన్యవాదాలు. వచ్చే ప్రపంచకప్​లోనూ సక్సెక్ కావాలని ఆశిస్తున్నాం. అలాగే భారత జట్టు తరఫున అతడు పరుగుల వరద పారించాలని కోరుకుంటున్నాం."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"భారత జట్టు భవిష్యత్ ప్రణాళికపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం. పని భారంపై చాలాకాలంగా కోహ్లీతో దీని గురించి చర్చించాం. టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నాడు. ఆరు నెలల నుంచి కోహ్లీతో పాటు యాజమాన్యంతోనూ ఈ విషయమై చర్చిస్తున్నాం. ఓ ఆటగాడిగా జట్టుకు అతడు మరిన్ని సేవలు అందిస్తాడు. అలాగే భారత జట్టు రూపురేఖల్ని మార్చడంలో సహాయపడతాడని భావిస్తున్నా" అని తెలిపాడు బీసీసీఐ ఉపాధ్యక్షుడు జైషా.

వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​లో భారత్​ను ముందుండి నడిపించనున్నాడు కోహ్లీ. ఈ టోర్నీలో గెలిచి కెప్టెన్​గా కోహ్లీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని జట్టు భావిస్తోంది.

ఇవీ చూడండి: కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details