తెలంగాణ

telangana

ఓటమి నుంచి కోలుకోకుండానే ఆర్సీబీకి మరో షాక్​..దినేశ్ కార్తీక్​కు అనారోగ్యం!

By

Published : May 10, 2023, 3:53 PM IST

Updated : May 10, 2023, 4:07 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మైదానంలో వాంతులు చేసుకున్నాడు. దీంతో అతని ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ కోచ్​ సంజయ్​ బంగార్​.. దినేశ్​ ఆరోగ్యంపై అప్డేట్​ ఇచ్చారు. అదేంటంటే..

dinesh karthik
dinesh karthik health update

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్​లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ఆర్సీబీ. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓటమిని చవి చూస్తున్న ఆర్సీబీకి ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్​లోని ఫినిషర్ దినేశ్​ కార్తీక్ అనారోగ్యం పాలయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​ మొదలు నుంచి నుంచి డీకే అంతగా రాణించట్లేదు. ఫామ్​ లేమి కారణం చేత కూడా అతను ట్రోల్​కు సైతం గరయ్యాడు. అయితే గత రెండు మ్యాచుల్లో మాత్రం కొంచెం అద్భుత ప్రదర్శన చూపిస్తున్నట్లే కనిపించాడు. ముంబయితో జరిగిన మ్యాచ్​లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇటువంటి వార్త అభిమానులను ఆందోళన కలిగించేలా చేస్తోంది.

ముంబయితో జరిగిన మ్యాచ్​లో కేవలం 18 బాల్స్​లోనే 30 రన్స్​ స్కోర్​ చేసిన డీకే.. ఆర్సీబీ టార్గెట్​ సాధించేందుకు తన వంతు కృషి చేశాడు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఔటైన ఈ స్టార్​ పేసర్​ పెవిలియన్ వెళ్లే సమయంలో తడబడ్డాడు. కిందకు వంగిపోతూ చాలా ఇబ్బందిగా మైదానాన్ని వీడాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఇన్నింగ్స్​లోనూ అతను ఆడలేదు. దీంతో అతని స్థానంలో అనూజ్ రావత్ వచ్చి.. కీపింగ్ చేశాడు. మరోవైపు దినేశ్​ అనారోగ్యంపై ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే దినేశ్​.. డీహైడ్రేషన్‌కు గురయ్యాడని వెల్లడించారు. దీని వల్లనే అతను అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడు.

"ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలోనే దినేశ్​ కొంత ఇబ్బంది పడ్డాడు. డీహైడ్రేట్ అవ్వడం వల్ల పెవిలియన్​కు చేరుకునే సమయంలోనూ వాంతులు కూడా చేసుకున్నాడు. అయితే వచ్చే మ్యాచ్ సమయానికి తను కచ్చితంగా కోలుకుంటాడనే అనుకుంటున్నాం. ఎందుకంటే రానున్న మ్యాచ్​కు మధ్యలో మూడు, నాలుగు రోజుల గ్యాప్ ఉంది. ఇక చికిత్స తీసుకుని మందులు వేసుకుంటే అతను తర్వాతి మ్యాచ్‌కు రెడీగా ఉంటాడు' అని పేర్కొన్నారు.

దినేశ్​ క్యాచ్​ మిస్​.. ఆనందంలో అనుష్క..
ఇక ఈ మ్యాచ్​లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఇన్నింగ్స్ చివరిలో దినేశ్​ కార్తీక్ ఆడుతున్న సమయంలో అతను కొట్టిన బాల్​ను క్యాచ్‌ పట్టేందుకు కామెరూన్ గ్రీన్ ముందుకొచ్చాడు. అయితే అతను ఆ క్యాచ్​ను వదిలేశాడు. బౌండరీ లైన్ వద్ద చేతుల్లోకి వచ్చిన బంతిని గ్రీన్ వదిలేయడం వల్ల రోహిత్ అసహనానికి గురయ్యాడు.. కానీ గ్రీన్ క్యాచ్ వదిలేయడాన్ని చూసి గ్యాలరీలో కూర్చున్న అనుష్క శర్మ సెలబ్రేట్ చేసుకుంది. దినేశ్​ కొట్టిన బంతి గాల్లో ఉన్న సమయంలో ఆందోళన చెందిన అనుష్క.. క్యాచ్ మిస్ కాగానే లేచి నిల్చుని సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Last Updated : May 10, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details