ముంబయి-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ-సూర్యకుమార్ యాదవ్ వీడియో ఒకటి వైరల్గా మారింది. అయితే ఇందులో విరాట్, సూర్యను స్లెడ్జింగ్ చేశాడా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
డేల్ స్టెయిన్ వేసిన 13వ ఓవర్లో ఒక లెగ్బైస్ రావడం సహా సూర్యకుమార్ మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో అతడు 40 పరుగులకు చేరుకొని ప్రమాదకరంగా మారుతున్నాడు. అప్పటికి ముంబయి స్కోర్ 99/3. బెంగళూరుకు కూడా విజయావకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీకి కోపం వచ్చి సూర్య వద్దకు వెళ్లాడు. అప్పుడే ముంబయి బ్యాట్స్మన్ బెంగళూరు కెప్టెన్ను పట్టించుకోకుండా పక్కకు తప్పుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.