తెలంగాణ

telangana

'బటర్ చికెన్ తింటాడు.. కానీ అందులో'.. ధోనీ ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టిన ఊతప్ప!

By

Published : Mar 20, 2023, 7:58 AM IST

టీమ్​ఇండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీకి ఉన్న వెరైటీ ఆహారపు అలవాట్లను మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వెల్లడించాడు. ఆహారం విషయానికి వస్తే.. మిస్టర్​ కూల్​ కాస్త భిన్నంగా ఉంటాడని చెప్పాడు. ఆ సంగతులు అతడి మాటల్లోనే..

MS Dhoni eats butter chicken without chicken
MS Dhoni eats butter chicken without chicken

ఎంఎస్​ ధోనీ, రాబిన్​ ఊతప్ప.. ఈ ఇద్దరు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్లు చాలా కాలంగా డ్రెస్సింగ్​ రూమ్​ను పంచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్​ నుంచి ఐపీఎల్​ వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. వీరిద్దరూ చాలా క్లోజ్​గా కనిపిస్తుంటారు. గత ఐపీఎల్​ సీజన్ వరకు ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్‌లో కలిసి ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఒకరి అలవాట్లు ఒకరికి బాగా తెలుసు. అయితే తాజాగా మిస్టర్​ కూల్​కు ఉన్న వెరైటీ ఆహారపు అలవాట్లను ఊతప్ప వెల్లడించాడు. ఫుడ్​ విషయంలో.. ధోనీ కాస్త వెరైటీగా ఉంటాడని తెలిపాడు. మహీ బటర్ చికెన్ తింటాడని.. కానీ అందులో ఉన్న చికెన్ మాత్రం తినడని చెప్పాడు. ఇంకా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అవి ఊతప్ప మాటల్లోనే..

బటర్ చికెన్‌లో నో చికెన్!
"మేం ఎప్పుడూ కలిసి తినేవాళ్లం. మాకు ఒక గ్రూప్ ఉంది. అందులో సురేశ్​ రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్, పీయూష్ చావ్లా, మునాఫ్ పటేల్, ఎంఎస్ ధోనీ, నేను ఉన్నాం. మేం దాల్ మఖానీ, బటర్ చికెన్, జీరా ఆలూ, క్యాబేజీ, రోటీస్ ఆర్డర్ చేసేవాళ్లం. ఇక్కడి ఆహారం విషయంలో ధోనీ భిన్నంగా ఉంటాడు. అతడు బటర్ చికెన్ తింటాడు. కానీ చికెన్ లేకుండా తింటాడు. గ్రేవీతో రోటీ మాత్రమే తింటాడు. మరోసారి చికెన్ తిన్నప్పుడు మాత్రం రోటీ తినడు."

మహీ అని పిలిచినా చాలు!
"నేను మొదటిసారి సీఎస్​కేలో చేరినప్పుడు.. జట్టులోని ప్రతి ఒక్కరూ అతడిని మహీ భాయ్ అని పిలవడం నేను చూశాను. నేను కూడా ధోనీ దగ్గరకు వెళ్లి మహీ భాయ్ అని పిలవాలా అని అడిగాను. అందుకు ధోనీ నిరాకరించాడు. నువ్వు ఎలా పిలవాలి అనుకుంటే అలా పిలవొచ్చు అని అన్నాడు. మహీ అని పిలిచినా చాలు అని చెప్పాడు."

అప్పుడే చెప్పేశాడు!
"ధోనీ చాలా ఓపెన్​ పర్సన్​. మీకు బాధ కలిగించినా.. నిజం మాట్లాడేందుకు వెనుకాడడు. సీఎస్​కే వేలం అగ్రిమెంట్​లో సంతకం చేసే సమయంలో నన్ను పిలిచాడు. సీజన్​కు ఇంకా చాలా సమయం ఉంది. మీకు ఆడే అవకాశం వస్తుందో లేదో కచ్చితంగా చెప్పలేను అని అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 13 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా గడిపాను. టీమ్​ఇండియాతో చెన్నై జట్టుకు ధోనీ అద్భుతమైన విజయాల్ని అందించాడు. అతడిలో చాలా టాలెంట్​ ఉంది. ఒక మ్యాచ్​ ఓడినా.. గెలిచినా ఆ ఫలితాన్ని తనపైనే వేసుకుంటాడు. అందుకే అతడు సక్సెస్​ఫుల్​ కెప్టెన్​గా మారాడు."

ABOUT THE AUTHOR

...view details