స్వదేశంలో ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ప్రత్యర్థి టీమిండియాను 85 పరుగుల తేడాతో ఓడించి, కప్పు ఎగరేసుకుపోయింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఓ తెలుగు పాట ప్లే కావడం హాట్ టాపిక్గా మారింది.
మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ను చూసేందుకు 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఇందులో ఎక్కువ శాతం భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే 'జనతా గ్యారేజ్'లోని పక్కా లోకల్ పాట వేయడం వల్ల అభిమానులు డ్యాన్స్లు వేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఇది చదవండి:నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం