టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో.. రోహిత్ ఇప్పటికీ 70 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని స్పష్టంచేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. గాయంతో ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్ల్ల్ రోహిత్ శర్మ ఎందుకు ఆడాడో అతడినే అడగాలని అన్నాడు.
"రోహిత్శర్మ ఇప్పటికీ 70 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకపోయినా ఎందుకు ఆడాడో రోహిత్నే అడగండి. అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్తో లేడు కాబట్టే వన్డేలు, టీ20లకు ఎంపికవలేదు. టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కింది. ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి మాకు తెలుసు. టీమ్ఇండియా ఫిజియోకి తెలుసు. ఎన్సీఏకు తెలుసు. ఇంకా ఎవరు తెలుసుకోవాలి? బీసీసీఐ ఎలా పనిచేస్తుందో కొందరికి తెలియదు. వృద్ధిమాన్ సాహా రెండు తొడకండరాల గాయాల గురించి బీసీసీఐ ట్రెయినర్లు, ఫిజియోతో పాటు అతడికి కూడా తెలుసు. కొందరికి గాయాల గురించి అర్థంకాదు. అందుకే ఇష్టంవచ్చినట్లు మాట్లాడతారు. టెస్టుల సమయానికి ఫిట్గా అవుతాడనే సాహాను ఆసీస్కు పంపించాం. పరిమిత ఓవర్ల జట్టులో అతడు లేడు. ఐపీఎల్ ఆసాంతం టీమ్ఇండియా ఫిజియోలు, ట్రెయినర్లు దుబాయ్లోనే ఉన్నారు. ఆటగాళ్ల గాయాల్ని నితిన్ పటేల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాడు"
--సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు