ETV Bharat / sports

'సరైన వ్యక్తితో నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నా!'

author img

By

Published : Nov 13, 2020, 9:35 PM IST

ఆస్ట్రేలియా పర్యటన కోసం సిడ్నీ చేరుకున్న టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్​ అయ్యర్​.. సోషల్​మీడియాలో ఆసక్తికర పోస్టు పంచుకున్నాడు. తన క్వారంటైన్​ సమయంలో సరైన వ్యక్తితో సమయాన్ని గడుపుతున్నట్లు తెలిపాడు.

Shreyas Iyer enjoys 'perfect company' amid quarantine in Sydney
'సరైన వ్యక్తితో నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నా!'

యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్​ ప్రీమియర్​ (ఐపీఎల్​) ఇటీవలే ముగిసిన క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్​ఇండియా జట్టు గురువారం సిడ్నీ చేరుకుంది. దాదాపుగా 14 రోజుల పాటు ఆటగాళ్లు నిర్బంధంలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీలోని తన హోటల్​ గదిలో ఉన్న చిత్రాన్ని భారత క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​ సోషల్​మీడియాలో ఓ పోస్ట్​ చేశాడు. క్వారంటైమ్​ సమయంలో సరైన కంపెనీ అని ట్యాగ్​ పెట్టాడు. అయితే ఆ ఫొటోలో శ్రేయస్​ రకరకాల ఫోజులతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. అంటే తనతో తానే నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నాడు.

శ్రేయస్​ అయ్యర్​.. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​లో బ్యాట్స్​మన్​గా అత్యుత్తమ ప్రదర్శన చేయడం సహా.. కెప్టెన్​గా తన జట్టును సమర్థవంతంగా ఫైనల్​కు చేర్చడంలో విజయం సాధించాడు. అయితే ఐపీఎల్​ ఫైనల్​కు దిల్లీ క్యాపిటల్స్ చేరడం ఇదే తొలిసారి. శ్రేయస్​ అయ్యర్ ఈ టోర్నీలో ​ 500 పరుగుల మార్కును దాటి.. సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. 17 మ్యాచ్​ల్లో 34.60 సగటుతో 519 రన్స్​ చేశాడు.

భారత్​-ఆస్ట్రేలియా మధ్య నవంబరు 28 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. డిసెంబరు 17 నుంచి క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా-భారత్​ మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.