తెలంగాణ

telangana

Kidambi Srikanth: ఇండియా ఓపెన్​లో శ్రీకాంత్‌కు టాప్‌ సీడింగ్‌

By

Published : Dec 21, 2021, 7:57 AM IST

Kidambi Srikanth Seeding

Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో రజత పతకం సాధించిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్​కు 'ఇండియా ఓపెన్‌' టోర్నీలో టాప్​ సీడింగ్ దక్కింది. ఈ మ్యాచ్​లు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి.

Kidambi Srikanth: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి జోరుమీదున్న భారత స్టార్‌ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ 'ఇండియా ఓపెన్‌' బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌ టాప్​ సీడింగ్ దక్కింది. వచ్చే నెల 11న దిల్లీలో ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం మరో స్టార్‌ షట్లర్‌ పి.వి. సింధుతో పాటు స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, మాల్విక బన్సోద్‌, ఆకర్షి కశ్యప్‌, అస్మిత కూడా ఆడుతున్నారు.

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ కాకుండా సాయి ప్రణీత్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌, ప్రణయ్‌, పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ పోటీలో ఉన్నారు. ప్రపంచ ఛాంపియన్‌ కీన్‌ యూ (సింగపూర్‌) కూడా ఈ టోర్నీ బరిలో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, పుల్లెల గాయత్రి-త్రెసా జోలీ పోటీపడుతున్నారు.

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌-500 టోర్నీల్లో భాగంగా ఇండియా ఓపెన్‌ నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అభిమానులకు అనుమతి ఇవ్వట్లేదు. దిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్‌ ఇండోర్‌ హాల్‌లో టోర్నీ నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details