తెలంగాణ

telangana

మహేశ్​బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం..

By

Published : Dec 31, 2021, 9:57 AM IST

Updated : Dec 31, 2021, 10:40 AM IST

Shilpa Shirodkar Covid: సినీనటుడు మహేశ్​బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేశ్​ వదిన శిల్పా శిరోద్కర్ కొవిడ్ ​బారిన పడ్డారు.

shilpa shirodkar
శిల్ప శిరోద్కర్

Shilpa Shirodkar Covid: సూపర్​స్టార్ మహేశ్​బాబు వదిన నటి శిల్పా శిరోద్కర్ కొవిడ్​ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్​ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్​లో నివసిస్తున్న శిల్ప.. బుధవారం ఇన్​స్టా వేదికగా కొవిడ్​ బారినపడినట్లు పోస్ట్ చేశారు.

కొవిడ్ బారినపడి నాలుగు రోజులు అవుతున్నట్లు శిల్ప తన పోస్ట్​లో పేర్కొన్నారు. "అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా. ప్రతి ఒక్కరు తప్పకుండా టీకా తీసుకోవాలి. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించండి. ప్రభుత్వం మీపట్ల జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది." అని ఫొటోకి కాప్షన్ జోడించారు.

ఈ పోస్ట్​పై తన సోదరి, నటి నమ్రత శిరోద్కర్​ కామెంట్ చేశారు. 'త్వరగా కోలుకో' అని అన్నారు. సంగీత బిలానీ కూడా శిల్ప త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కామెంట్ చేశారు.

Last Updated : Dec 31, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details