తెలంగాణ

telangana

రిషీ కపూర్, ఇర్ఫాన్​ కలిసున్న ఫొటో వైరల్​

By

Published : Apr 30, 2020, 1:17 PM IST

బాలీవుడ్​ నటుడు రిషీకపూర్​, ఇర్ఫాన్​ ఖాన్​లు కేవలం రోజు వ్యవధిలోనే మరణించడం అభిమానులను బాధించింది. ఈ నేపథ్యంలో 'డి డే' సినిమాలో వీరిద్దరు కలిసున్న ఫొటో ఇప్పుడు వైరల్​గా మారింది.

Rishi Kapoor, Irrfan Khan's 'D Day' still goes viral, netizens mourn 'two legends in one frame'
ఈ దివంగత నటులిద్దరి జంట ఫొటో వైరల్​

బాలీవుడ్​ దిగ్గజ నటుడు రిషీకపూర్(67)​, విలక్షణ నటుడు ఇర్ఫాన్​ ఖాన్( 54)​.. కేవలం రోజు వ్యవధిలోనే క్యాన్సర్​తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. వీరి మరణం అభిమానుల్ని, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'డి డే'(2013)లోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటో వైరల్​గా మారింది. ఇందులో భాగంగా రిషీ-ఇర్ఫాన్ కారులో ప్రయాణిస్తూ ఉంటారు. చిరునవ్వుతో ఇర్ఫాన్ కనిపిస్తుండగా, గంభీరంగా​ ఉన్న లుక్​లో రిషీకపూర్​ కనిపించారు.

ఈ నటుల మృతిపై అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details