తెలంగాణ

telangana

Mahesh Babu: అభిమానుల కోసం మహేశ్​ పక్కా ప్లాన్

By

Published : Sep 9, 2021, 5:31 AM IST

అభిమానుల వరుసగా సినిమాలు చూపించేందుకు మహేశ్​ సిద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్​ పూర్తిచేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చేస్తున్న సూపర్​స్టార్.. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు.

mahesh babu
మహేశ్​బాబు

'సరిలేరు నీకెవ్వరు' విజయంతో దూకుడు మీదున్నారు స్టార్​హీరో మహేశ్‌బాబు. అదే వేగంతో తన తర్వాతి చిత్రం 'సర్కారువారి పాట'(sarkaru vaari paata) పూర్తి చేద్దామనుకున్నా, ఆ స్పీడ్‌కు కరోనా(coronavirus) బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు పరుశురామ్‌ వర్కింగ్‌ స్టైల్‌ కూడా అదే కావడం వల్ల సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందట.

మహేశ్ సర్కారు వారి పాట మూవీ

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత గ్యాప్‌ వచ్చినట్లు ఈ సారి రాకుండా చూసుకుందామని మహేశ్‌(mahesh sarkari vari pata) ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' పూర్తి చేసి, విరామం తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్‌(trivikram mahesh movie) క్యాంప్‌లోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. అన్నీ కుదిరితే నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ షురూ కానున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఇప్పటికే ఎంపిక చేశారు.

'సర్కారు వారిపాట'లో కథానాయికగా కీర్తి సురేశ్‌(keerthy suresh) నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details