తెలంగాణ

telangana

వదినా మరిది.. అక్కా త‌మ్ముడిగా మారారు

By

Published : Apr 14, 2019, 2:52 PM IST

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో హీరోయిన్​ జ్యోతిక, కార్తీ నటించనున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సినిమాలో వీరిద్దరూ అక్కా తమ్ముడిగా కనిపించనున్నారు.

వదినా మరిది..అక్కా త‌మ్ముడిగా మారారు

నిజ జీవితంలో జ్యోతిక, కార్తి.. వ‌దినా-మ‌రిది అవుతారు. తెర‌పై మాత్రం ఒకే త‌ల్లికి పుట్టిన బిడ్ద‌లుగా క‌నిపించ‌బోతున్నారు. జీతూజోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో వీరిద్దరూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు. తమిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆ చిత్రం రూపొంద‌నుంది. తెలుగులోనూ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

ఈ డైరక్టర్ ఇంతకు ముందు 'పాపనాశనం'(దృశ్యం సినిమా మాతృక) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు . అది పలు భాషల్లో రీమేకై అన్ని చోట్ల ఘనవిజయం సాధించింది.

హీరోయిన్​ జ్యోతిక త‌న రెండో ఇన్నింగ్స్‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. నాగార్జున నటించనున్న 'బంగార్రాజు' చిత్రబృందమూఇటీవ‌లే ఆమెను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం.

ఇది చదవండి: కార్తీ చిత్రంతో రష్మిక తమిళ ఎంట్రీ

New Delhi, Apr 14 (ANI): Prime Minister Narendra Modi paid tribute to Dr Bhimrao Ramji Ambedkar on his birth anniversary. Today is 128th birth anniversary of BR Ambedkar, also known as 'Babasaheb'. 'The father of the Constitution of India' was born on April 14, 1891. Ambedkar Jayanti honours the Dalit icon who dedicated his life working for social justice.

ABOUT THE AUTHOR

...view details