తెలంగాణ

telangana

ఆ బాధ తట్టుకోలేక ఏడ్చేశా: అనసూయ

By

Published : Apr 16, 2021, 5:18 PM IST

బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ఆరంభించిన అనసూయ ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా నటిగానూ రాణిస్తున్నారు. ఒకానొక సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని తెలిపారు. ఆ సమయంలో ఎంతో ఆవేదనకు లోనయ్యానని ఆమె అన్నారు.

anasuya
అనసూయ

ఒకానొక సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని నటి అనసూయ తెలిపారు. ఆ సమయంలో ఎంతో ఆవేదనకు లోనయ్యానని ఆమె అన్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ఆరంభించిన అనసూయ ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా నటిగానూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులను బయటపెట్టారు.

అనసూయ

తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్ల నుంచి నెగిటివ్‌ కామెంట్లు వచ్చాయని అనసూయ అన్నారు. అలాగే తన పెద్దకుమారుడు కూడా.. తాను వెస్ట్రన్‌ దుస్తులు ధరిస్తే బాలేదని.. పొడవాటి దుస్తులు ధరించమని చెబుతాడని ఆమె తెలిపారు. అనంతరం ఎన్నో సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు.

"కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ చాలాసార్లు ఆవేదనకు లోనయ్యా. ఓసారి నాకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు.. కొన్నిరోజులకే ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయి. అలాంటి సమయంలో నా భర్త దగ్గర కూర్చొని బాగా ఏడ్చేసేదాన్ని. ఆ బాధను పోగొట్టుకోవడం కోసం రాత్రి సమయంలో చాలా అరుదుగా వైన్‌ కూడా తాగుతుంటా" అని అనసూయ వివరించారు.

ఇదీ చదవండి:'జాతిరత్నాలు' కడుపుబ్బా నవ్వించింది: కార్తిక్

ABOUT THE AUTHOR

...view details