తెలంగాణ

telangana

'ఇంట్లోనే దూరంగా ఉంటున్నాం'​

By

Published : Mar 28, 2020, 6:54 AM IST

ఎప్పడూ తీరిక లేకుండా షూటింగ్​లు, సినిమా ప్రచారాలతో బిజీగా ఉండే సినీతారలు లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా దెబ్బకు ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. రోజూవారి విశేషాలను సామాజిక మధ్యమాల్లో పంచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది యువ కథానాయిక అనన్యాపాండే. ప్రస్తుతం విజయ్​ దేవరకొండ సరసన నటిస్తోన్న ఈ భామ చెబుతున్న ఆసక్తికర విషయాలు..

ananya pandey shared corona lockdown expereince
ఇంట్లోనే దూరంగా ఉంటున్నామంటున్న యువ హీరోయిన్​

నిత్యం షూటింగులు, సినిమా ప్రచారాలతో తీరిక లేకుండా గడిపేసే సినిమా తారలు కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన కొందరు స్వీయ నిర్బంధంలో ఉంటే లాక్‌డౌన్‌తో మిగిలిన తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి నచ్చిన కాలక్షేపం వాళ్లు చేస్తున్నారు. ఆ విశేషాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచిస్తున్నారు. బాలీవుడ్‌ యువనాయిక అనన్యాపాండే విరామ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం ఈ భామ విజయ్‌దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరెకిక్కిస్తోన్న చిత్రంలో నటిస్తోంది.

‘‘నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాకా ఇంతవిరామం ఎప్పుడూ రాలేదు. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. షూటింగుల బిజీతో చాలా పనులు చేయలేకపోయా. ఇప్పుడవన్నీ చేస్తున్నాను. నా సోదరితో కలిసి నాకిష్టమైన కుకీస్‌ వండుతున్నాను. మా కుక్కతో ఆడుకుంటున్నాను. నాకు వర్కవుట్లు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ తోడుగా స్నేహితులు ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే వ్యాయామాలు చేస్తూ వీడియో కాలింగ్‌ ద్వారా ఆ ముచ్చట్లు పంచుకుంటున్నాం. నాకు ఒకప్పుడు పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. నాకు నచ్చిన పుస్తకాల్ని చదివేస్తున్నా’’

-అనన్య పాండే.

ABOUT THE AUTHOR

...view details