తెలంగాణ

telangana

జంట హత్యల కలకలం.. పీఎస్​లో లొంగిపోయిన నిందితుడు

By

Published : Oct 11, 2020, 4:48 PM IST

ఏపీలోని నెల్లూరులో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరో మహిళను హత్య చేశాడు.

two-womens-murder-in-nellore in ap
ఇద్దరు మహిళలు దారుణహత్య..పీఎస్​లో లొంగిపోయిన నిందితుడు

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. నవలాకులతోటకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి అనుమానంతో తన భార్య నిర్మలమ్మతో పాటు మరో మహిళ రమణమ్మను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు స్టేషన్​లో లొంగిపోయాడు.

తరచూ వీరి కాపురంలో గొడవలు జరుగుతుండేవని బంధువులు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవీ చూడండి: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు

ABOUT THE AUTHOR

...view details