వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో ఓ తనయుడు తన కన్న తల్లిని కడతేర్చాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలోని మల్లమ్మను చున్నీతో ఉరివేసి ఆమె కుమారుడు సురేష్ హత్య చేశాడు.
ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..?
తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దానికి తోడు ఆమె ప్రవర్తన బాగోలేదని భావించాడు. చివరకు అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే చున్నీతో ఉరివేసి కడతేర్చాడు. పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు.
![ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..? Son who killed mother on suspicion of extramarital affair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10027760-992-10027760-1609082817292.jpg)
అనుమానంతో కన్నతల్లిని చంపిన తనయుడు
మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. తన తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఆమె ప్రవర్తన బాగోలేక పోవటంతో హత్య చేశానని కుమారుడు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు.
ఇదీ చూడండి:'హత్య వెనుక కుట్రను వెలికి తీయండి.. కఠినంగా శిక్షించండి'