తెలంగాణ

telangana

కార్మికుడిని ఢీకొన్న కంటైనర్... తీవ్ర గాయాలు

By

Published : Dec 26, 2020, 10:23 AM IST

రోడ్డు మరమ్మతులు చేస్తుండగా సదాశివనగర్​ మండలం పద్మాజివాడి శివారులో ప్రమాదం జరిగింది. కంటైనర్ ఆపాలని చెప్పినా... ఆగకుండా రావడం వల్ల కార్మికుడిని ఢీకొంది. తీవ్రగాయాలపాలైన అతడిని హైదరాబాద్​ ఆస్పత్రికి తరలించారు.

road-accident-on-NH-at-sadashivanagar-mandal-in-kamareddy-district
కార్మికుడిని ఢీకొన్న కంటైనర్... తీవ్ర గాయాలు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడిని కంటైనర్ ఢీకొంది. కంటైనర్​ని ఆపాలని చెప్పినా ఆపకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన కార్మికుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రి తీసుకెళ్లగా... పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​కు తరలించారు.

కార్మికుడిని ఢీకొన్న కంటైనర్

గాయపడిన కార్మికుడు వికారాబాద్ జిల్లా బాణాపూర్ గ్రామానికి చెందిన యాదప్పగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:'కూలి'న బతుకులు: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details