నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 20న బాలికను ద్విచక్రవాహనంపై గ్రామశివారుకు తీసుకెళ్లిన యువకుడు.. ఎవరూ లేని సమయం చూసి అత్యాచారానికి యత్నించాడు.
బోధన్ మండలంలో మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం
మైనర్ (9) బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బోధన్ గ్రామీణ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.
![బోధన్ మండలంలో మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం rape attempt on minor girl at bodhan mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8507666-773-8507666-1598016746595.jpg)
బోధన్ మండలంలో మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం
బాలిక కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడిపై బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.