తెలంగాణ

telangana

అమెరికాలోని భారతీయుల ఇళ్లలో వరుస చోరీలు- పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు

By ETV Bharat Tech Team

Published : Dec 22, 2023, 5:43 PM IST

Robbery On Indo-Americans Houses : భారతీయ అమెరికన్ల ఇళ్లే లక్ష్యంగా యూఎస్​ రాజధాని వాషింగ్టన్​లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గత రెండు వారాలుగా ఇవి ఎక్కువయ్యాయని అమెరికా పోలీసులు తెలిపారు.

Robbery On Indo Americans Houses In US Announced By Police
Robbery On Indo Americans Houses In US Washington

Robbery On Indo-Americans Houses : ఇండో-అమెరికన్ల నివాసాలే లక్ష్యంగా యూఎస్​ రాజధాని వాషింగ్టన్​లో దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారని అమెరికా పోలీసులు తెలిపారు. గత రెండు వారాలుగా ఇవి మరింత ఎక్కువయ్యాయని చెప్పారు. వాషింగ్టన్​లోని వివిధ ప్రాంతాల్లో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని అక్కడి మీడియా సంస్థలూ పేర్కొంటున్నాయి. ముఖ్యంగా బోథెల్ ప్రాంతంలో నివసించే భారతీయ అమెరికన్ల ఇళ్లను దొంగలు ప్రధాన లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు అందగా స్నోహోమిష్ కౌంటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

"దుండగులు ఇండో-అమెరికన్ల ఇళ్లలోనే చోరీలకు పాల్పడుతున్నారు. గత రెండు వారాలుగా ఇవి మరింతగా పెరిగిపోయాయి. అది కూడా పగటిపూట ఈ దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారికి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్లు భావిస్తున్నాం. చోరీ జరిగిన ప్రాంతాల్లో దొంగలకు సంబంధించి ఏవైనా వీడియోలు లేదా ఫొటోలు సీసీటీవీల్లో రికార్డ్​ అయి ఉంటే వాటిని మాకు సమర్పించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాము."
- రాబరీ అండ్ బర్గ్‌లరీ యూనిట్​

'దొంగల భయంతో ఇంటికి సీసీ కెమెరాలతోపాటు మేము పెప్పర్​ స్ప్రే క్యాన్​లు కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాము. ఇందుకోసం వేల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలావరకు దొంగతనాలు నాన్​-అమెరికన్ల ఇళ్లలోనే జరుగుతున్నాయి. అయితే ఆత్మరక్షణ కోసం అమెరికన్​ పౌరుల దగ్గర ఉండే విధంగా వీరి దగ్గర ఆయుధాలు ఉండకపోవచ్చు. ఈ కారణంతోనే దుండగులు రెచ్చిపోయి ఈ విధంగా నాన్​-లోకల్స్​ను టార్గెట్​ చేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటున్నాను' అని ఇక్కడ నివసిస్తున్న భారతీయ అమెరికన్​ రామ్​ చెప్పారు.

కాన్యన్ క్రీక్ ప్రాంతంలోని ప్రజల ఇళ్లలోకి చొరబడిన కొందరు అనుమానితుల ఫొటోలను స్నోహోమిష్ కౌంటీ పోలీసులు బుధవారం విడుదల చేశారు. పౌరులందరూ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని, అన్ని కిటికీలు, స్లైడింగ్ తలుపులు, యాక్సెస్ పాయింట్‌లు లాక్​ చేసుకుని ఉంచుకోవాలని ప్రజలను కోరారు.

రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్​గా మేక్రాన్​! బైడెన్​కు బదులుగా ఆయనే!!

యూనివర్సిటీలో కాల్పుల కలకలం- 15మంది మృతి, మరో 9మంది పరిస్థితి విషమం!

TAGGED:

ABOUT THE AUTHOR

...view details