తెలంగాణ

telangana

రెస్టారెంట్​లో ఘోర అగ్ని ప్రమాదం- 17 మంది మృతి

By

Published : Sep 28, 2022, 2:17 PM IST

Updated : Sep 28, 2022, 3:15 PM IST

రెస్టారెంట్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. ఈశాన్య చైనాలోని చాంగ్​చున్​లో జరిగిందీ దుర్ఘటన.

China fire accident today
రెస్టారెంట్​లో ఘోర అగ్ని ప్రమాదం

చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. జిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్​చున్​లోని ఓ రెస్టారెంట్​లో బుధవారం మధ్యాహ్నం 12.40కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించగా.. అనేక మంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని, దర్యాప్తు సాగుతోందని అధికారులు చెప్పారు. న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్​లోని హైటెక్ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జిలిన్ రాష్ట్ర రాజధాని అయిన చాంగ్​చున్.. వాహనాల తయారీ కేంద్రంగా ప్రసిద్ధి.

Last Updated : Sep 28, 2022, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details