తెలంగాణ

telangana

తల్లి పింఛనుపై కన్ను.. ఇంట్లోనే మృతదేహంతో ఏడాదిగా...

By

Published : Sep 10, 2021, 4:59 PM IST

Updated : Sep 10, 2021, 5:08 PM IST

తల్లి మృతదేహాన్ని ఇంటి బేస్​మెంట్​లోనే దాచిపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఆమెకు వచ్చే పింఛను కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఏడాదిగా అధికారులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.

austria
ఆస్ట్రియా

ఆస్ట్రియా టైరల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లికి అందే పింఛనుపై కన్నేసిన ఓ వ్యక్తి.. ఆమె మరణాంతరం ఏడాదిపాటు మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. అధికారులను మోసం చేస్తూ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేశాడు.

ఇంటి బేస్​మెంట్​లో...

టైరల్​ రాష్ట్ర పోలీసులు.. ఇన్స్​బ్రక్​ ప్రాంతంలో గురువారం ఓ ఇంటికి వెళ్లారు. 89ఏళ్ల వృద్ధురాలు.. 2020 జూన్​లో మరణించిందన్న అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటి బేస్​మెంట్​లో వృద్ధురాలి మృతదేహం దొరికింది. వెంటనే ఆమె కొడుకును అరెస్ట్​ చేశారు.

విచారణలో భాగంగా.. తల్లి మరణించిన అనంతరం.. ఆమెకు వచ్చే పింఛను, నర్సింగ్​ అలవెన్స్​ కోసం.. మృతదేహాన్ని బేస్​మెంట్​లో దాచిపెట్టినట్టు 66ఏళ్ల ఆ వ్యక్తి అంగీకరించాడు. ఇప్పటివరకు ఆ వ్యక్తికి.. 50వేల యూరోలు అందినట్టు తెలుస్తోంది. అతడికి తల్లి పింఛను మినహా మరే ఇతర ఆదాయం లేదని పోలీసులు తెలిపారు.

పింఛను కోసం తల్లిని కొడుకే హతమార్చాడా? అన్న కోణంలో విచారణ జరిగింది. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. శవపరీక్షలోనూ అలాంటిదేదీ బయటపడలేదు.

ఇలా బయటపడింది..

పింఛను అందించేందుకు ఓ కొత్త పోస్ట్​మ్యాన్​ ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. పింఛను ఇవ్వాలంటే లబ్ధిదారును పిలవాలని డిమాండ్​ చేశాడు. దీనికి ఆ వ్యక్తి నిరాకరించాడు. అనుమానం వచ్చి పోస్ట్​మ్యాన్​ అధికారులకు ఈ విషయాన్ని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు.. బేస్​మెంట్​లో ఐస్​ప్యాకెట్లు, బ్యాండేజీలతో కట్టి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.

ఇదీ చూడండి:-కుటుంబ సభ్యులే హత్యకు ప్రయత్నించి.. చివరికి..

Last Updated : Sep 10, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details