తెలంగాణ

telangana

జైశంకర్​ పర్యటనతో మారిన లెక్కలు- చైనా కీలక వ్యాఖ్యలు

By

Published : Sep 17, 2021, 5:57 PM IST

చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పిన మాటలను అంగీకరిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు(China India Relations).. మూడో దేశంపై ఆధారపడి ఎప్పటికీ కొనసాగవని తెలిపింది. ఇది ఇరు దేశాల అంతర్గత విషయం అని స్పష్టం చేసింది.

china india relations
భారత్ చైనా సంబంధాలు

భారత్​తో తన సంబంధాలను(China India Relations) మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్​ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు(China India Relations) ఇరు దేశాల అంతర్గత విషయాలు అని స్పష్టం చేసింది. తజికిస్థాన్ రాజధాని దుషన్‌బే వేదికగా జరగుతున్న షాంఘై సహకార సదస్సులో(SCO Summit 2021) పాల్గొనేందుకు వెళ్లిన జైశంకర్‌(s jaishankar china).. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమయ్యారు.

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న మిగతా సమస్యలను ఇరు దేశాలు త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ​చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ గుర్తుచేశారు. పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉందని అన్నారు. అది మూడో దేశం కోణం నుంచి ఉండకుండా చూడాలని సూచించారు.

జైశంకర్ వ్యాఖ్యలపై బీజింగ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్​ స్పందించారు. భారత్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

"భారత్ అభిప్రాయాలతో మేం ఏకీభవిస్తున్నాం. చైనా, భారత్ రెండు ఆసియాలో ప్రధానమైన దేశాలు. ఇరు దేశాలు తమ సంబంధాలను ఏర్పరచుకోవడం అత్యంత సహజమైన ప్రక్రియ. అది ఇరు దేశాల అంతర్గత విషయం. చైనా, భారత్ సంబంధాలు మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పటికీ కొనసాగవు. లేదా మూడో దేశంపై ఆధారపడి ఉండవు.

-ఝావో లిజియాన్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

జైశంకర్​, వాంగ్​ యీ భేటీకి ముందు.. చైనా, భారత్​ సరిహద్దు సమస్యలకు సరైన పరిష్కారాన్ని వెతికేందుకు తాము ఎప్పుడూ సానుకూలంగా ఉంటామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు.. ప్రభావవంతంగా సాగాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతకుముందు మరో ప్రకటనలో తెలిపింది. సరిహద్దు ప్రాంతంలో క్రమంగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆ ప్రకటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం కొనసాగించేందుకు భారత్ తమతో కలిసి పని చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో గత ఏడాది మే 5న హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. అప్పటి నుంచి ఇరుదేశాలు సరిహద్దు వెంట సైనిక బలగాలను విస్తరించాయి. అనంతరం జరిగిన సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఈశాన్య లద్దాఖ్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాలు అంగీరించాయి.

ఇదీ చూడండి:Modi SCO Summit: 'తీవ్రవాదం పెను సవాల్- ఉమ్మడి పోరు తక్షణావసరం'

ABOUT THE AUTHOR

...view details