తెలంగాణ

telangana

ట్రిలియన్ డాలర్ల బిల్లుపై బైడెన్ సంతకం

By

Published : Nov 16, 2021, 9:30 AM IST

అమెరికాలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ట్రిలియన్ డాలర్ల బ్లిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చనుంది. ఉభయపక్షాలు తలచకుంటే ఏం సాధించవచ్చో ఈ బిల్లు రుజువు చేసిందని బైడెన్ అన్నారు. ఈ చట్టంతో అమెరికన్ల జీవన విధానమే మారిపోతుందని ఆకాంక్షించారు.

Biden signs $1T infrastructure bill with bipartisan audience
ట్రిలియన్ డాలర్ బిల్లుపై బెడెన్ సంతకం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ట్రిలియన్ డాలర్ల ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బిల్లుపై సోమవారం సంతకం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల అమెరికన్ల జీవిన విధానంలో సమూల మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. ఉభయపక్షాలు సహకరిస్తే ఏం సాధించవచ్చో చెప్పేందుకు ఈ బిల్లే నిదర్శమమని పేర్కొన్నారు.

ద్రవ్యోల్భణం పెరగడం, నిరుద్యోగాలు, కరోనా మహమ్మారి, ఆర్థిక ముప్పు వంటి కారణాలతో బైడెన్ ప్రజాదరణ తగ్గుతోంది. అయితే ట్రిలియన్​ డాలర్ల బిల్లుతో ఆయన పాపులారిటీ మళ్లీ పెరుగుంతందని భావిస్తున్నారు. 'అమెరికా మరోసారి మార్పు దిశగా పయనిస్తోంది. మీ జీవితాలు మరింత మెరుగుపడతాయి' అని బిల్లుపై సంతకం చేసిన తర్వాత బైడెన్ సందేశమిచ్చారు.

ఈ చట్టంతో అమెరికాలో ఉద్యోగాలు, స్వచ్ఛమైన నీరు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయులు మెరుగుపడతాయని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. రోడ్లు, వంతెనలు, భవిష్యత్తులో స్వచ్ఛ ఇంధనం, బ్రాడ్​బ్యాండ్, నీటి వ్యవస్థ, నౌకాశ్రయాలు వంటి వాటిలో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుంతుందని భావిస్తోంది.

ఈ బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. 2022 మధ్యంతర ఎన్నికలకు ముందు ఉభయపక్షాలు ఐకమత్యం ప్రదర్శించిన చివరి ఘట్టం కూడా ఇదే కానుందని ఆ పార్టీ చట్టసభ్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కష్టాల్లో ట్రంప్.. గట్టెక్కేందుకు​ హోటళ్ల అమ్మకం

ABOUT THE AUTHOR

...view details