తల్లి ఇందిరా దేవి మృతితో సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం తన నివాసంలోనే కన్నుమూశారు. ఇందిరా దేవి పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు మహేశ్. ఒకే ఏడాదిలో అటు అన్నయ్య.. ఇటు తల్లి మరణంతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.
తల్లి అంత్యక్రియలు పూర్తైన తర్వాత సోషల్ మీడియాలో ఇందిరా దేవి జ్ఞాపకాలను తలచుకుంటూ మహేశ్బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మాతృమూర్తి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించి ఓ పాత ఫొటోను షేర్ చేశారు.