యాక్షన్ హీరో గోపీచంద్, విలక్షణ నటుడు అల్లరి నరేశ్.. ఇద్దరు ఒకేరోజు మే 5న తమ కొత్త చిత్రాలో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గోపిచంద్ రాణబాణంతో రాగా.. నరేశ్ ఉగ్రంతో పలకరించారు. అయితే ఈ రెండు చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఇవి రెండు మోస్తరు వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది.
ఆశించిన స్థాయిలో నో.. గోపీచంద్ నటించిన 'రామబాణం' ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో విడుదలైనట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 620కి పైగా థియేటర్లలో రిలీజ్ అయినట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద రూ.14.5 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సినీ వర్గాల టాక్. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15.20 కోట్లుగా నమోదైంది. కానీ తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.1.17కోట్లు షేర్, రూ.2.20కోట్ల గ్రాస్ వచ్చిందట. వరల్డ్వైడ్గా తొలి రోజు రూ.1.27 కోట్ల షేర్, రూ.2.45కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత శ్రీవాస్- గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. డింపుల్ హయాతీ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ఖుష్బూ, అలీ, నాజర్, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.