Wife tried to kill her husband: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరులో దారుణం జరిగింది. బైక్పై వెళ్తుండగా భర్త గొంతును భార్య కోసేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. సౌత్ మోపూర్కు చెందిన ప్రసన్న కుమార్, లక్ష్మీ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలున్న లక్ష్మీప్రసన్న భర్తను, పిల్లలను వదిలేసి ప్రసన్నకుమార్ను వివాహం చేసుకుంది.
వీరికి ఓ కుమారుడు పుట్టగా.. ఇటీవల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భర్తపై కక్ష పెంచుకుంది. నెల్లూరు నుంచి బైక్పై సౌత్ మోపూరుకు వెళ్తుండగా మొగళ్లపాళెం స్టేడియం సమీపంలో ప్రసన్నకుమార్ గొంతు కోసింది. గుర్తించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీ ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.