తెలంగాణ

telangana

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

By

Published : May 16, 2021, 5:41 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే పై వంతెన మీద వాహన తనిఖీలు చేపట్టి.. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు.

sand tractors seize, kagaznagar news, kumaram bheem asifabad news
sand tractors seize, kagaznagar news, kumaram bheem asifabad news

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

"కాగజ్​ నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పట్టణంలోని రైల్వే పై వంతెన మీద వాహన తనిఖీలు చేపట్టాం. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నాం" అని టాస్క్​ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.

ఇదీ చూడండి: వీణవంకలో తెరాస, ఈటల వర్గాల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details