తెలంగాణ

telangana

PD Act against Gambling Organiser : పేకాట నిర్వాహకుడు గుత్తాసుమన్​పై పీడీ చట్టం

By

Published : Dec 3, 2021, 9:59 AM IST

Updated : Dec 3, 2021, 10:22 AM IST

PD Act against Gambling Organiser : మంచిరేవుల ఫాంహౌస్​లో పేకాట నిర్వహిస్తూ పట్టుబడ్డ గుత్తాసుమన్​పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పీడీ చట్టం ప్రయోగించారు.

PD Act against Gambling Organiser, Gutta suman cases
పేకాట నిర్వాహకుడు గుత్తాసుమన్​పై పీడీ చట్టం

PD Act against Gambling Organiser : పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్​పై సైబరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల ఫాం హౌస్​లో పేకాట నిర్వహిస్తూ గుత్తా సుమన్ ఇటీవల పోలీసులకు పట్టుబడ్డారు. సుమన్​పై గతంలోనూ గచ్చిబౌలి, పంజాగుట్ట పీఎస్​ ల్లోనూ కేసులున్నాయి. గుత్తా సుమన్​పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పీడీ చట్టం ప్రయోగించారు. పీడీ చట్టం ప్రయోగించడంతో గుత్తా సుమన్ ఏడాది పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటారు. పీడీ చట్టం వల్ల బెయిల్​కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు.

ఎవరీ గుత్తా సుమన్..?

Gutta suman cases: విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతూ సైబరాబాద్‌ పోలీసులకు చిక్కినట్టు కూడా గుర్తించారు. ‘సుమన్‌కుమార్‌ చుట్టూ బాడీగార్డులను పెట్టుకుని ప్రముఖుడిగా చలామణి అవుతుంటాడు. పెద్దవాళ్లతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడు. భూకబ్జాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాం. మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయి నుంచి ఫాంహౌస్​లు, స్టార్‌హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక క్యాంప్‌(casino hyderabad news)లను ఏర్పాటుచేసే స్థాయికొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేశాడు. స్థిరాస్తి వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఓ న్యూస్‌ ఛానెల్‌కు డైరెక్టర్‌గానూ పనిచేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భారీగా మోసాలకు పాల్పడ్డాడు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

సకల సౌకర్యాలతో ఎర

రెస్టారెంట్లకు, హోటళ్లకు కస్టమర్లను ఆకర్షించేందుకు వినసొంపైన సంగీతం, ఆకర్షణీయమైన వంటకాలు, సకల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లుగా.. పేకాట శిబిరాలకు ప్రముఖులను ఆకర్షించేందుకు రుచికరమైన వంటలను గుత్తా సుమన్(Manchirevula farm house case)​​ ఏర్పాటు చేస్తాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల ఫామ్​ హౌస్​ పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్(Manchirevula farm house case)​​ను పోలీసులు ప్రశ్నించారు.

రుచికరమైన వంటలు

పేకాట కేసులో గుత్తా సుమన్... నిర్వహణ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నార్సింగి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు(Manchirevula farm house case)​లో తేలింది. ప్రముఖులను ఆకర్షించడానికి పలు రుచికరమైన వంటలతో పాటు... చేపల కూర వెరైటీలను భోజనంలో వడ్డిస్తాడని... పేకాట శిబిరంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. సుమన్​పై గచ్చిబౌలి పీఎస్​లోనూ పేకాట కేసు(Manchirevula farm house case)​ నమోదైంది. పంజాగుట్ట, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లలో మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలోనూ సుమన్​పై కేసులున్నాయి.

ఇదీ చదవండి:Gambling case: మంచిరేవుల ఫామ్​హౌస్​ కేసులో సుమన్​కు బెయిల్

Last Updated : Dec 3, 2021, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details