తెలంగాణ

telangana

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం

By

Published : Mar 18, 2021, 5:12 PM IST

డీసీఎం డ్రైవర్​ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన వాహనం సాఫ్ట్​వేర్ ఉద్యోగి జీవితాన్ని చిదిమేసింది. డీసీఎం, ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో హైదరాబాద్​లోని సుచిత్రకు చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదం ఉప్పల్ క్రికెట్​ స్టేడియం ఏక్ మినార్​ వద్ద చోటు చేసుకుంది.

software engineer died in road accident at uppal cricket stadium near ek minar in hyderabad today
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం

డీసీఎం వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సాఫ్ట్​వేర్ మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదం హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం ఏక్​మినార్​ వద్ద జరిగింది. డ్రైవర్​ నిర్లక్ష్యం, అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ల్యాప్​టాప్​ కోసం వస్తూ..

నగరంలోని సుచిత్రలో నివాసముండే శివనాగిరెడ్డి ఉప్పల్‌-రామంతాపూర్‌ మార్గంలో ఉన్న ఎన్‌ఎస్‌ఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చేందుకు ఆఫీసుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం ఏక్ మినార్‌ వద్దకు రాగానే రామంతాపూర్‌ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హైకోర్టుల్లోని టీకా కేసులన్నీ సుప్రీంకు బదిలీ

ABOUT THE AUTHOR

...view details