తెలంగాణ

telangana

ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

By

Published : Jun 5, 2022, 8:15 PM IST

Road Accident: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

Road Accident: నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్‌వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అర్సపల్లికి చెందిన గంగాధర్‌ తన కుటుంబ సభ్యులతో ఎడపల్లికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. బాపునగర్ కల్వర్టు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కంటైనర్‌ లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గంగాధర్‌ తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details