తెలంగాణ

telangana

Girl Suicide: ముళ్లపొదల్లో నవజాత శిశువు.. బావిలో తల్లి మృతదేహం!

By

Published : Sep 1, 2021, 11:22 AM IST

Updated : Sep 1, 2021, 3:04 PM IST

Newborn baby dead body found in birmal thanda

11:17 September 01

గాంధారి మండలం బీర్మల్ తండాలో దారుణం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. బీర్మల్ పంచాయతీ పరిధిలోని దుర్గం చెరువు దగ్గర అప్పుడే పుట్టిన మగ శిశువు ముళ్లపొదల్లో లభ్యమైంది. మంగళవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చిన బాలిక... ఆపై బావిలో దూకి బలవన్మరణానికి(Girl Suicide) పాల్పడింది. తల్లి అవివాహిత, మైనర్ కావడంతో పసికందును ముళ్లపొదల్లో పడేసి... ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

దర్యాప్తు

మంగళవారం రాత్రి మూడు గంటల సమయంలో నవజాత శిశువును ఐసీడీఎస్(ICDS) అధికారులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పసికందుకు చికిత్స అందిస్తూ.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతి చెందిందా?  లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి పోలీసులు వెల్లడించారు.  

మంత్రి స్పందన

ఈ ఘటనపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక మృతికి కారణమైన వారికి తగిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పసికందు ఆరోగ్యాన్ని పరిరక్షించాలని మంత్రి సూచించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని... విచారణ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అనంతరం శిశువును ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు. బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి... మోసం చేసి గర్భవతిని చేసినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దోషులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:Ts Police: ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్టు.. మావోయిస్టులతో సంబంధాలే కారణమా!

Last Updated :Sep 1, 2021, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details