తెలంగాణ

telangana

girl suicide attempt: పరీక్షలకు భయపడి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 25, 2022, 10:33 AM IST

girl suicide attempt: మానసిక ఒత్తిడితో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పదో తరగతి పరీక్షల భయంతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

commits suicide  attempt
ఆత్మహత్యాయత్నం

girl suicide attempt: పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ఆందోళనకు గురై ఓ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అందుకు సంబంధించిన వివరాలు కుల్సుంపుర ఎస్సై సత్యనారాయణ వెల్లడించారు. జియాగూడ ఇక్బాల్‌గంజ్‌కు చెందిన బాలిక(15) జియాగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది.

కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 15 రోజులు స్కూల్‌కు వెళ్లలేదు. వచ్చే నెల 23 వ తేదీ నుంచి పరీక్షలు ఉండటంతో ఒత్తిడికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొంది. గమనించిన ఆమె తల్లి, సోదరి మంటలార్పి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 67 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details