తెలంగాణ

telangana

couple died in vishaka: భార్య ఉసురు తీసిన అనుమానం.. ఆపై తానూ..

By

Published : Dec 16, 2021, 6:50 PM IST

couple died in vishaka: ఆలూమగల అన్యోన్య దాంపత్యానికి నమ్మకం, ప్రేమ పునాది. వాటిలో ఏది కొరవడినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. చివరికి అది ఎలాంటి పరిణామాలకైనా దారి తీసే అవకాశం ఉంది. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను చంపి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

couple died in vishaka
విశాఖలో దంపతుల మృతి

couple died in vishaka: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఆమెను చంపేశాక పోలీసులకు ఎలాగూ దొరుకుతాను.. శిక్ష తప్పదని భావించాడో ఏమో.. తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఏపీలోని విశాఖపట్టణం జిల్లా శ్రీ హరి పురం పరిధిలోని గొల్లలపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

డంబెల్​తో కొట్టి

శివనాగేశ్వర రావు, మాధవి భార్యాభర్తలు. ఇటీవల మాధవిపై శివనాగేశ్వర రావుకు అనుమానం కలగడంతో.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఆమెను ఇనుప డంబెల్​తో కొట్టి హత్య చేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Groom missing: రెండ్రోజుల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం.. అసలేం జరిగిందంటే..?

ABOUT THE AUTHOR

...view details