తెలంగాణ

telangana

కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!

By

Published : Apr 18, 2022, 9:48 PM IST

వారిద్దరికీ నిశ్చితార్థమైపోయింది.. ఇక మిగిలింది పెళ్లే. మే నెలలో ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సరదాగా షికారు చేయడానికి బైక్​పై బయలుదేరారు. కాసేపు అలా తిరిగి.. ఆ తర్వాత షాపింగ్ కూడా చేశారు. అనంతరం ఓ బాబా ఆశ్రమం పరిసరాల్లో ఆగారు. అక్కడ సరాదాగా కళ్లకు గంతలు ఆట ఆడేందుకు సిద్ధమయ్యారు. కాబోయే భర్త రెడీ అన్నాడు. కళ్లకు గంతలు కట్టింది కాబోయే భార్య. ఆ వెంటనే కత్తితో అతని గొంతు కోసింది. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్ల పూడి వద్ద చోటు చేసుకుంది.

కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!
కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!

ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని మాడుగుల ఘాట్ రోడ్​కు చెందిన 28 సంవత్సరాల యువకుడు అద్దేపల్లి రామునాయుడుకు, రావికమతం గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతికి నిశ్చితార్థమైంది. వచ్చే నెలలో పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై షాపింగ్​కు వెళ్లారు. కొమళ్లపూడిలో షాపింగ్ అనంతరం.. పక్కనే ఉన్న బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. అక్కడ కళ్ల గంతలు ఆడుదామని వధువు చెప్పడంతో.. రామునాయుడు సరే అన్నాడు. అతని కళ్లకు గంతలు కట్టిన యువతి.. ఆ తర్వాత కత్తితో అతని గొంతు కోసింది.

అనంతరం.. ద్విచక్రవాహనంపై సమీపంలోని రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, గొంతుకు ఏదో గుచ్చుకుని గాయమైందని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పి, అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అనంతరం యువకుడిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, సదరు యువతి కోసం గాలింపు చేపట్టారు. బాధిత యువకుడు హైదరాబాద్​లో పీహెచ్​డీ చేస్తున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details