తెలంగాణ

telangana

పట్టపగలే చోరీ: ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోపే దోచేశారు!

By

Published : Jan 26, 2021, 9:18 PM IST

చోరీలు చేసేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇళ్లను గుల్ల చేస్తున్నారు. పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో బీరువాను పగలగొట్టిన దొంగలు రూ.7 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో ఈ సంఘటన జరిగింది.

theft in macherial district ramakrishnapur
సింగరేణి కార్మికుని ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. శ్రీరాంపూర్​లో సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న రాజలింగం ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో బీరువాను పగలగొట్టి రూ.7 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

పట్టపగలే చోరీ.. భారీగా నగదు, ఆభరణాలు మాయం

పట్టణంలోని విద్యానగర్​లో నివాసముంటున్న రాజలింగం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మంచిర్యాలలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడం చూసి అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే జాగిలాలను రప్పించి తనిఖీలు చేపట్టిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. స్థానిక ఎస్సై రవిప్రసాద్​ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాారు. అనంతరం వేలిముద్రల నిపుణులను రప్పించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి :ఒళ్లు గగుర్పొడిచే కిల్లర్ కథ... 18 హత్యల వెనుక క్రైం కహానీ!

ABOUT THE AUTHOR

...view details