తెలంగాణ

telangana

dead body found in water: మానేరు వంతెన కింద మరో మృతదేహం లభ్యం

By

Published : Nov 17, 2021, 11:41 AM IST

మానేరు(manair) చెక్​డ్యామ్​లో గల్లంతైన మనోజ్ మృతదేహాన్ని(dead body found in water) ఇవాళ వెలికి తీశారు. సోమవారం నాడు మొత్తం ఆరుగురు విద్యార్థులు గల్లంతు కాగా... నిన్నటి వరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మనోజ్ మృతదేహం బ్రిడ్జి వరకు కొట్టుకురావడంతో సహాయక బృందాలు ఇవాళ వెలికి తీశాయి. ఈతకోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

dead body found in water, students missing in check dam
మానేరులో మృతదేహాలు లభ్యం, మానేరులో విద్యార్థులు గల్లంతు

రాజన్న సిరిసిల్లలోని మానేరు వంతెన కింద మరో మృతదేహం(dead body found in water) లభ్యమైంది. మనోజ్ మృతదేహం చెక్‌డ్యామ్‌ నుంచి బ్రిడ్జి వద్దకు కొట్టుకొచ్చింది. ఈనెల 15న 9 మంది విద్యార్థులు చెక్‌డ్యామ్‌లో ఈత కోసం దిగారు. తొమ్మిది మందిలో ఆరుగురు విద్యార్థులు చెక్‌డ్యాంలో మునిగిపోయారు. మంగళవారం వరకు ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశారు. మనోజ్‌ మృతదేహం బ్రిడ్జి వరకు కొట్టుకురాగా... వంతెన కింద గుర్తించారు.

ఈత రాకపోయినా దిగారా?

సిరిసిల్ల రాజీవ్‌నగర్‌కు చెందిన 9 మంది విద్యార్థులు సరదాగా మానేరు(manair incident) వాగు వద్దకు వచ్చారు. అందులోని ఆరుగురు విద్యార్థులు ఈత రాకపోయినా చెక్‌డ్యామ్‌లోకి దిగారు. ఆరుగురు ఒకేసారి నీటమునిగారు. బయటే ఉన్న మరో ముగ్గురు విద్యార్థులు తమ మిత్రులు నీటిలో మునిగిపోవడంతో ఆందోళనకు గురై... పరుగున కాలనీకి వెళ్లి ప్రమాదం గురించి చెప్పారు. ఆరుగురి మృతదేహాలను(dead body found in water) నిన్నటి నుంచి ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే.... తల్లిదండ్రులు వాటిని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరతారనుకుంటే అకాల మరణంతో కడుపు కోత మిగిల్చారంటూ విలపించారు.

తరుచుగా జరుగుతున్నాయా?

ఈఏడాది భారీగా కురిసిన వర్షాలకు వాగులో నిరంతరం నీరు ప్రవహిస్తోంది. నెహ్రూనగర్‌ సమీపంలో నిర్మించిన చెక్‌డ్యాం వరదలకు గండి పడింది. ఇక్కడ ఇసుక కోతతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. లోతైన ప్రాంతానికి వెళ్లకుండా గ్రిల్స్‌, ఇనుప కంచె ఏర్పాటులేవీ లేకపోవడంతో తెలియని వారు వచ్చి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల్లో ఇవాళ నాలుగు మృతదేహాలు(Dead bodies found) లభ్యమయ్యాయి. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం రోజున మానేరు వాగు చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లగా... వారిలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు((missing in Manair check dam). ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు.

విషాద ఛాయలు

ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla news) జిల్లాలో విషాదం నెలకొంది.జిల్లాకేంద్రం శివారులోని మానేరు చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు(students) గల్లంతుకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వారిలో రాజీవ్‌నగర్​కు చెందిన గణేశ్‌ మృతదేహం సోమవారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మరో నలుగురి మృతదేహాలు మంగళవారం వెలికితీయగా... మనోజ్ మృతదేహం ఇవాళ లభ్యమైంది. వీరంతా సిరిసిల్ల జిల్లాకేంద్రం వెంకంపేట ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించారు.

మంత్రి కేటీఆర్ విచారం

మానేరు వాగులో విద్యార్థుల గల్లంతు ఘటనపై మంత్రి కేటీఆర్(ktr news) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీతో మంత్రి మంగళవారం ఉదయం మాట్లాడారు. ఈ ఘటనపై ఆరా తీశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఎఫ్(DRF News) అధికారులతోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మానేరు వాగులో విద్యార్థుల గల్లంతు ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:Dead bodies found in pond: కుంటలో చిన్నారుల మృతదేహాలు.. చంపిందెవరు?

ABOUT THE AUTHOR

...view details