తెలంగాణ

telangana

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

By

Published : May 17, 2021, 6:15 PM IST

Updated : May 17, 2021, 6:58 PM IST

gold
బంగారం, విమానాశ్రయం

18:03 May 17

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ వచ్చిన పాతబస్తీకి చెందిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. 

వారి నుంచి రూ. 1.2 కోట్లు విలువైన 2.4 కిలోల బరువు కలిగిన 21 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ తెలిపారు. బంగారు బిస్కెట్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకుని తెచ్చినట్లు వివరించారు. ఇద్దరు ప్రయాణికులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం స్మగ్లింగ్‌ చేసేందుకే హైదరాబాద్‌ నుంచి వారు దుబాయ్‌ వెళ్లినట్లు అనుమానిస్తున్న కస్టమ్స్‌ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:శేషాచలం కొండల్లో గుప్త నిధుల వేట.. ఏడాది కాలంగా సొరంగం తవ్వకం

Last Updated :May 17, 2021, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details