రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాడె మోశారు. తన వ్యక్తిగత సహాయకుడు కిరణ్ తల్లి దమయంతి మరణించటంతో.. ఆమె మృతిపట్ల మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ సంస్కారాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పాడె మోశారు.
పీఏ తల్లి మృతి.. పాడె మోసిన మంత్రి పువ్వాడ
అతనొక మంత్రి. అతని వ్యక్తిగత సహాయకుడి తల్లి మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి.. సంతాపం వ్యక్తం చేసి, నివాళులు అర్పించి ఊరుకోలేదు. అమ్మ ఎవరికైనా అమ్మే అనే సహృదయంతో ఆలోచించి.. హోదాని మరిచి పాడె మోశారు.
![పీఏ తల్లి మృతి.. పాడె మోసిన మంత్రి పువ్వాడ Transport Minister Puvvada Ajay Kumar Deceived Coffin in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10563630-148-10563630-1612891142133.jpg)
పీఏ తల్లి మృతి.. పాడె మోసిన మంత్రి పువ్వాడ