తెలంగాణ

telangana

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

By

Published : May 24, 2022, 11:29 AM IST

Updated : May 24, 2022, 12:01 PM IST

Release of notification for Rajya Sabha biennial elections 2022 in Telangana
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

11:27 May 24

రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

Rajya Sabha Elections: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్​లో పదవీకాలం ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. మంగళవారం నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీన నామినేషన్ల పరిశీలన, మూడోతేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులుగా హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు పేర్లను తెరాస ప్రకటించింది. 25న ఉదయం 11 గంటలకు వీరివురూ నామినేషన్‌ వేయనున్నారు.

అంతకుముందుగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికకు గాయత్రి గ్రానైట్ కంపెనీస్ అధినేత వద్దిరాజు ర‌విచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.

ఇవీ చదవండి:రాజ్యసభ సభ్యుడిగా గాయత్రి రవి ఏకగ్రీవం

దేశంలో 2వేల దిగువకు కరోనా కొత్త కేసులు.. తగ్గిన మరణాలు

Last Updated : May 24, 2022, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details