తెలంగాణ

telangana

అమెరికాలో స్ట్రీట్‌ ఫుడ్‌ తిన్న మంత్రి కేటీఆర్​... ఏం ఆర్డర్ చేశారంటే..

By

Published : Mar 26, 2022, 5:19 PM IST

Updated : Mar 26, 2022, 7:11 PM IST

పెట్టుబడులను ఆకర్షింటే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న కేటీఆర్​ కాసేపు సరదాగా గడిపారు. స్ట్రీట్‌ ఫుడ్‌ తిన్నారు.

ktr eat street food
ktr

మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్... తాను చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో... ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాత మీటింగ్​కు బయలుదేరారు.

ఫుడ్‌ ఆర్డర్​ చేస్తున్న మంత్రి కేటీఆర్​

విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్​తో కూడిన చికెన్ రైస్​ను తిన్నారు. అనంతరం మరో సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్​లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు... కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, మీటింగ్​కి క్యాబ్​లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు.

స్ట్రీట్‌ ఫుడ్‌ బండితో కేటీఆర్ సెల్ఫీ

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్​... పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాకాలను వివరిస్తున్నారు.

ఇదీ చదవండి :లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్

Last Updated :Mar 26, 2022, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details