తెలంగాణ

telangana

Harish Rao in Assembly 2021: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు త్వరలోనే శ్రీకారం

By

Published : Oct 1, 2021, 10:55 AM IST

Updated : Oct 1, 2021, 12:39 PM IST

మూడురోజుల విరామం అనంతరం శాసనసభ సమావేశాలు(assembly sessions news) ప్రారంభం కాగా... ఒకటి రెండు మాసాల్లోనే.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి... పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​రావు (minister Harish Rao) ఈ సభలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

Harish Rao in Assembly 2021
Harish Rao in Assembly 2021

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో తాగునీరు సమస్య పరిష్కారం అయిందని మంత్రి హరీశ్​రావు (Minister Harish Rao) అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. మూడ్రోజుల విరామం అనంతరం శాసనసభ సభ సమావేశాలు (assembly sessions 2021) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో శాసనసభ్యులు క్రాంతి కిరణ్​, మహారెడ్డి భూపాల్​రెడ్డి, మాణిక్​రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్​రావు సమాధానమిచ్చారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై హరీశ్​రావు సమాధానం

ఒకటి రెండు మాసాల్లోనే.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి... పనులు ప్రారంభిస్తాం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధిక సాగునీరు అందుకోనున్న నియోజకవర్గంగా నారాయణఖేడ్‌ నిలుస్తుంది. అతి త్వరలోనే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

- హరీశ్ రావు, మంత్రి

4.97 శాతానికి పెరిగింది

తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయా ఉత్పత్తి వాటా అత్యధికంగా పెరిగిన విషయం వాస్తవమేనా అని అసెంబ్లీలో గాదరి కిషోర్​ కుమార్​ అడిగారు. ఆ పూర్తి వివరాలు తెలిపాలని కోరారు. దీనికి మంత్రి హరీశ్​రావు సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్‌డీపీ 4.06 శాతంగా ఉండేదని వెల్లడించారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.97 శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందన్నారు.

దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో జీఎస్​డీపీ వాటాపై హరీశ్​రావు సమాధానం

15వ ఆర్థిక సంఘం ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని సూచించినా... కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. ప్రతి ఏడాదీ దేశ జీడీపీలో జీఎస్​డీపీ వాటా పెంచుకుంటూ వెళ్తున్నామన్న మంత్రి... ఏడేళ్లలో ప్రాథమిక రంగానికి రెండున్న లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

- హరీశ్​రావు, మంత్రి

అత్యధిక వృద్ధి రేటు నమోదు

దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాథమిక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు నీతిఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ఉద్ఘాటించారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని వివరించారు.

ఇదీ చూడండి: LIVE: శాసనసభ వర్షాకాల సమావేశాలు

Last Updated :Oct 1, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details