తెలంగాణ

telangana

Twin reservoirs: జంట జలాశయాలకు వరద.. మూసీ నదిలోకి నీటి విడుదల

By

Published : Oct 9, 2021, 12:33 PM IST

Updated : Oct 9, 2021, 12:47 PM IST

హైదరాబాద్​ శివారు ప్రాంతాల్లో నిన్న కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. క్రమంగా పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంటున్నాయి. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ గేట్లను ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు.. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Twin reservoirs
Twin reservoirs: జంట జలాశయాల వరద.. మూసీ నదిలోకి నీటి విడుదల

భాగ్యనగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో రహదారులు వాగులను తలపిస్తున్నాయి. నగరంలోని జంట జలశయాలకు అధికంగా వరద నీరు వస్తోంది. హిమాయత్ సాగర్ జలశయానికి భారీగా వరద నీరు రావడంతో జలమండలి అధికారులు రిజర్వాయర్ మరో రెండు గేట్లను ఒక అడుగు పైకి ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు.

మొత్తం 4 గేట్ల ద్వారా 1400 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ గండిపేట పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కురుస్తుండడంతో ఇవాళ మరో మూడు వరద గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నాలుగు గేట్ల ద్వారా 960 క్యూసెక్యుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.

గత రాత్రి మహేశ్వరం పరిధిలో అత్యధికంగా 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవటంతో మీర్‌పేట, సరూర్‌నగర్‌, చంపాపేట, హయత్‌ నగర్‌, రాజేంద్రనగర్‌లోని పలు కాలనీలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. అత్యవసర పనులకు తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లొద్దని బల్దియా సూచించింది.

ఇవీ చూడండి:

Last Updated : Oct 9, 2021, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details