తెలంగాణ

telangana

Simhachalam: సింహాచలం సింహగిరిపై కూలిన ధ్వజ స్తంభం

By

Published : Aug 11, 2021, 12:24 PM IST

ఏపీలోని సింహాచలం సింహగిరిపై సీతారామస్వామి ఆలయం ధ్వజస్తంభం కూలిపోయింది. ధ్వజస్తంభంలోపలి కర్ర పూర్తిగా చెదలు పట్టడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజ స్తంభం ఏర్పాటు చేస్తామని ఈఓ సూర్యకళ పేర్కొన్నారు.

simhachalam
సింహగిరిపై కూలిన ధ్వజస్తంభం

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లాలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం(సింహాచలం) ఉపాలయం.. సీతారామాలయంలో ధ్వజస్తంభం నేలకూలింది. కాలాతీతమైన ఈ ధ్వజస్తంభం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దశాబ్దాల క్రితం (దాదాపు 60 ఏళ్లు) ప్రతిష్ఠించిన ఈ ధ్వజస్తంభంలోపలి కర్ర పూర్తిగా చెదలుపట్టడమే దీనికి కారణమని వెల్లడించారు.

ఆలయంలోని సీసీ కెమెరాలను ఈఓ సహా ఉన్నతాధికారులు పరిశీలించగా... అది తనంతట తానే పడిపోయినట్లు తేలిందని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని... కాలాతీతమవ్వడమే కారణమని నిర్ధరణ అయ్యిందని వివరించారు. వేద మంత్రాలు, సంప్రోక్షణ తర్వాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తామని ఈఓ సూర్యకళ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Huzurabad: హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్.... ఖరారు చేసిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details