ETV Bharat / state

Huzurabad: హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్.... ఖరారు చేసిన కేసీఆర్

author img

By

Published : Aug 11, 2021, 11:36 AM IST

Updated : Aug 11, 2021, 12:07 PM IST

హుజూరాబాద్ ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిని ప్రకటించారు. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

huzurabad by election trs candidate gellu srinivas yadav
Huzurabad: హుజూరాబాద్ తెరాస అభ్యర్థి దాదాపు ఖరారు.. ఆయన ఎవరంటే?

హుజూరాబాద్ తెరాస అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్‌ ఉపఎన్నిక అనివార్యమైంది. నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలను పరిశీలించిన తర్వాత తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ వైపే కేసీఆర్‌ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది.

వీణవంక మండలం హిమ్మత్​నగర్‌కు చెందిన గెల్లు శ్రీనివాస్‌... మలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి నేతగా చురుగ్గా ఉన్న గెల్లు శ్రీనివాస్‌ 2017 నుంచి తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: Huzurabad: ఎవరైతే బాగుంటుంది... హుజూరాబాద్ ఉపఎన్నికపై తెరాస కసరత్తు

Last Updated : Aug 11, 2021, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.