తెలంగాణ

telangana

CJI justice NV Ramana: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

By

Published : Dec 25, 2021, 4:23 PM IST

Updated : Dec 25, 2021, 9:57 PM IST

CJI justice NV Ramana: ఏపీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు ఏపీ సీఎం జగన్‌ స్వాగతం పలికారు.

సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

CJI justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన తేనీటి విందు కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తేనీటి విందులో సీజేఐకి.. రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేశారు.

AP CM Jagan Meets CJI: అంతకు ముందు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను.. సీఎం జగన్‌ దంపతులు కలిశారు. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు.. సీఎం జగన్ దంపతులు పుష్పగుచ్ఛం అందించారు.

Last Updated : Dec 25, 2021, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details