తెలంగాణ

telangana

అదిరిపోయే ఫీచర్లతో 5 కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు.. త్వరలోనే మార్కెట్​లోకి ఎంట్రీ!

By

Published : May 28, 2023, 7:17 PM IST

5 Upcoming Electric Scooters Launching Soon

Upcoming Electric Scooter In India 2023 : కొద్ది రోజుల్లోనే భారత్​ మార్కెట్​లోకి సరికొత్త ఈవీ స్కూటర్లు ప్రవేశించనున్నాయి. దిగ్గజ సంస్థలతో పాటు ఓ స్టార్టప్​ కంపెనీ.. ఈ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం ఐదు ఈ-స్కూటర్లు మార్కెట్​లోకి ఆరంగ్రేటం చేయనున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Upcoming Electric Scooter In India 2023 : భారతీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్​ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న ఈవీ తయారీ సంస్థలు.. వినియోగదారుల కోసం సరికొత్త స్కూటర్లను రూపొందిస్తున్నాయి. దిగ్గజ టూవీలర్​ తయారీ సంస్థలు సైతం ఈ స్కూటర్​లను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు వాహనాలకు అన్ని రకాల ట్రయల్స్​ను పూర్తి చేసి.. కొద్ది రోజుల్లోనే వాటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. కాగా త్వరలోనే మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చే.. ఐదు వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​టీ..
కొద్ది వారాల్లోనే ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను వినియోగదారులు ముందుకు తీసుకురానుంది టీవీఎస్​. సరికొత్త ఫీచర్లతో తయారు చేసిన 'టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​టీ'ని 2023 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది సంస్థ. మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంటుందన్న ఆంచనాలతో వస్తుంది టీవీఎస్​. 4.56kWh బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ స్కూటర్​ కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. దాదాపు 145 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు. 'టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​టీ' స్కూటర్​ గరిష్ఠంగా 82 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ వంటి కొత్త అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ​

టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​టీ

సుజుకి ఈ-బర్గ్‌మాన్..
సుజుకి ఈ-బర్గ్‌మాన్ స్కూటర్​ను 2023 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది సంస్థ. భారత్​లో దీని టెస్ట్​ రైడ్​లు సైతం చాలా సార్లు జరిగాయి. అన్నీ సవ్యంగా సాగితే.. 2024లో సుజుకి ఇ-బర్గ్‌మాన్ స్కూటర్​ భారత రోడ్లపై చూడొచ్చు. కాకపోతే దీని విడుదలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. స్కూటర్​ ఫీచర్ల గురించి కూడా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 4kW బ్యాటరీ సామర్థ్యంతో స్కూటర్​ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే దాదాపు 44 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చని సమాచారం. గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లు.

సుజుకి ఈ-బర్గ్‌మాన్

రెండు కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఈవీ వాహనాల తయారీ రంగంలోకి హోండా కూడా ప్రవేశించింది. 2024లో రెండు విద్యుత్ స్కూటర్లను మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ రెండు ఈవీ స్కూటర్లను భారత్​లోనే తయారు చేస్తోంది హోండా. మొదటి స్కూటర్​కు యాక్టివా ఎలక్ట్రిక్ అని పేరు పెట్టే అవకాశం ఉంది. మొదటి స్కూటర్​ ఫిక్స్​డ్​ బ్యాటరీని కలిగి ఉంటుందని.. రెండో స్కూటర్​ మార్చుకునే బ్యాటరీతో వస్తుందని సమాచారం.

యమహా ఎలక్ట్రిక్ స్కూటర్- నియో, E01..
ఈ మధ్యకాలంలో జరిగిన తమ డీలర్ల ఈవెంట్​లో 'నియో' ఈ స్కూటర్​ను ప్రదర్శించింది యమహా. త్వరలోనే భారత మార్కెట్​లోకి సైతం స్కూటర్​ను విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఈవీ స్కూటర్​ల ఉత్పత్తి జరుగుతూనే ఉంది. ఈ రెండు స్కూటర్​లు ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ​'నియో'ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 60 నుంచి 70 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు.

యమహా ఎలక్ట్రిక్ స్కూటర్- నియో
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్-E01

రివర్​ ఈ-స్కూటర్..
రివర్​ ఈ స్కూటర్​ను బెంగళూరు కేంద్రం పనిచేసే.. ఓ స్టార్టప్​ కంపెనీ తయారు చేస్తోంది. తమ మొదటి స్కూటర్​ను 2023 మధ్యకాలంలో.. భారత్​ మార్కెట్​లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది సంస్థ. కొద్ది రోజుల క్రితమే ఈ స్కూటర్​ టెస్ట్​ రైడ్​ సైతం పూర్తి చేసుకుంది. సాధారణ టైర్లతో పోలిస్తే.. రివర్​ ఈ స్కూటర్ టైర్లు కాస్త పెద్దవిగా ఉంటాయి. స్కూటర్​కు సంబంధించిన​ మరిన్ని ఫీచర్లు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

రివర్​ ఈ-స్కూటర్

ABOUT THE AUTHOR

...view details