తెలంగాణ

telangana

భారీగా పెరిగిన బంగారం, వెండి ధర.. నేటి లెక్కలు ఇలా?

By

Published : Mar 18, 2023, 11:56 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

today-gold-rates-in-hyderabad-and-vijayawada
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,180 పెరిగి.. ప్రస్తుతం రూ. 61,180గా ఉంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,380 పెరిగి.. ప్రస్తుతం రూ. 70,220 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో.. బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,180 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 70,220 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,180గా ఉంది. కిలో వెండి ధర రూ.70,220 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,180 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,220గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,180గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,220 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,989 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.65 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ..22,75,353 పలుకుతోంది. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.22,75,353
ఇథీరియం రూ.1,49,328
టెథర్​ రూ.82.75
బైనాన్స్​ కాయిన్​ రూ.28,423
యూఎస్​డీ కాయిన్ రూ.82.53

గోల్డ్ లోన్​ తీసుకోవాలా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు?
బంగారాన్ని హామీగా పెట్టుకుని చాలా బ్యాంక్​లు​ కస్టమర్​లకు అప్పులు ఇస్తాయి. బయట తీసుకునే అప్పులతో పోలిస్తే.. బంగారం రుణాలపై బ్యాంక్​లు వసూలు చేసే వడ్డీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బంగారాన్ని హామీగా పెట్టి వీలైనంత త్వరగా బ్యాంక్​ను నుంచి రుణాలు పొందవచ్చు. బంగారంపై రుణాలకు కనిష్ఠ డాక్యుమెంటేషన్‌ పక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ అప్పులపై వడ్డీలు వినియోగదారుడు తీసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటాయి. బంగారంపై రుణం కోసం ఆభరణాలను, నాణేలను తాకట్టు పెట్టవచ్చు. 18-22 క్యారెట్ల బంగారు ఆభరణాలను, బ్యాంకు ముద్రించిన బంగారు నాణేలను మాత్రమే హామీగా పెట్టి అప్పు తీసుకోవచ్చు. కాకపోతే బ్యాంకు ముద్రించిన బంగారు నాణేలపై.. ఒక క్లయింట్‌కు 50 గ్రాముల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.గోల్డ్​లోన్​పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఇస్తున్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details