తెలంగాణ

telangana

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

By

Published : May 31, 2023, 5:11 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold And Stocks
స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు ఏపీ తెలంగాణలో ఎంతంటే

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.455 పెరిగి.. రూ.60,400కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ.500 పెరిగి.. రూ. 72,750 వద్ద నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,960 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,030గా ఉంది.
  • Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,960 గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,960 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,030గా ఉంది.
  • Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,960గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,030 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,958 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.27 డాలర్ల వద్ద ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,35,494 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.22,35,494
ఇథీరియం రూ.1,54,227
టెథర్​ రూ.82.69
బైనాన్స్​ కాయిన్​ రూ.25,384
యూఎస్​డీ కాయిన్ రూ.82.74

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజ్‌​ (బీఎస్​ఈ) సెన్సెక్స్​ 347 పాయింట్లు క్షీణించి 62,622 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ.. 99 పాయింట్లు నష్టపోయి 18,534 పాయింట్ల దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్​ 30 సూచీలో యాక్సిస్​ బ్యాంక్​, ఎస్​బీఐ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్టీపీసీ, టాటా స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ షేర్లు నష్టపోగా.. భారతీ ఎయిర్​టెల్​, టెక్ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్​, సన్​ ఫార్మా, టాటా మోటార్స్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ కంపెనీలు లాభాల బాటలో ఉన్నాయి.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details