తెలంగాణ

telangana

ఏపీ, తెలంగాణలో పెరిగిన బంగారం ధరలు.. క్రిప్టో కరెన్సీలు భారీ పతనం

By

Published : Jun 17, 2022, 10:50 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి ధర రూ. 52,720గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,225గా ఉంది. క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి.

d
d

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.480 పెరిగి.. రూ.52,720 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400కుపైగా పెరిగి.. రూ.63,225గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,720గా ఉంది. కిలో వెండి ధర రూ.63,225 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,720గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,225గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,720గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,225 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,720గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,225 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1844 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.84 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.07 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ.18,46,412 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,15,157
ఇథీరియం రూ.90,789
టెథర్ రూ.83.65
బినాన్స్​ కాయిన్ రూ.17,975
యూఎస్​డీ కాయిన్ రూ.83.72

Stock Market: దేశీయ మార్కెట్​ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 165 పాయింట్లకుపైగా తగ్గి 51,330 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 15,298 వద్ద ట్రేడవుతోంది. బజాజ్​ ఫైనాన్స్​, టాటాస్టీల్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, ఎస్​బీఐ​ లాభాల్లో ఉన్నాయి. విప్రో, టైటాన్​, సన్​ఫార్మా, ఎసియన్​ పేయింట్​ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఇవీ చదవండి:పోటీతత్వ సూచీలో భారత్‌ ముందుకు.. ర్యాంక్ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details