తెలంగాణ

telangana

ఆరోగ్య బీమా సంస్థల ఆగడాలకు చెక్​! ఇకపై పాలసీలన్నీ ఒకేచోట

By

Published : Sep 18, 2022, 7:42 AM IST

Updated : Sep 18, 2022, 8:05 AM IST

health insurance

Bima Sugam IRDAI: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ఆరోగ్య బీమా లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కరోనా తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది.. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అధిక ప్రీమియం వల్ల కొందరు పాలసీ తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఆర్‌డీఏఐ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

Bima Sugam IRDAI: చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఎంత ఖర్చవుతుందో చెప్పడం కష్టం. ఆరోగ్య బీమా లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కొవిడ్‌ పరిణామాలతో ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అధిక ప్రీమియం వల్ల కొందరు పాలసీ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పలు కీలక సంస్కరణలకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

బీమా సుగమ్‌తో..:వివిధ సంస్థలు అందిస్తున్న ఆరోగ్య బీమా పాలసీలను పోల్చి చూసుకుని, వాటిలో ఏది మెరుగైందో తేల్చుకోవడం అంత సులభమేమీ కాదు. కొన్ని బీమా అగ్రిగేటర్‌ వెబ్‌సైట్లు ఈ విషయంలో పాలసీదారులకు సమాచారం అందిస్తున్నా.. అదీ పూర్తి వ్యాపార ధోరణితోనే ఉంటోంది. అందుకే ఐఆర్‌డీఏఐ 'బీమా సుగమ్‌' పేరుతో ఒక ప్రత్యేక వేదికను తీసుకు రానున్నట్లు సంస్థ ఛైర్మన్‌ దేవాశీష్‌ పాండా ఇటీవల వెల్లడించారు.

అందరూ బీమా పొందేలా..:గత అయిదేళ్లలో 19 శాతం చొప్పున వృద్ధి చెందుతున్న ఆరోగ్య బీమా రంగం, దాదాపు రూ.60,000 కోట్ల స్థాయికి చేరింది. మున్ముందు ఇది 30-35 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయని అంచనా. 2047 నాటికి దేశ ప్రజలందరూ ఆరోగ్య బీమా పరిధిలోకి రావాలనే ఆలోచనతో ఐఆర్‌డీఏఐ ఉంది. బీమాపై అవగాహన పెంచడం, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, కొత్త ఆవిష్కరణలతోనే ఇది సాధ్యం అవుతుందన్నది నియంత్రణ సంస్థ భావన.

కొవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం దాదాపు 25 శాతానికి పైగా పెరిగింది. క్లెయింల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని బీమా సంస్థలు అంటున్నాయి. పోటీని తట్టుకునేందుకు సంస్థలు తమ ఏజెంట్ల పంపిణీ కమీషన్‌ పెంచడం, ఇతర ఖర్చులూ కూడా సంస్థల వ్యయాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. అందుకే బీమా కంపెనీలు ఇచ్చే కమీషన్‌పై ఐఆర్‌డీఏఐ పరిమితి విధించింది. పాలసీలన్నీ డిజిటల్‌ రూపంలో జారీ చేయాలని పేర్కొంది. దీనివల్ల బీమా సంస్థలకు కొంత మేరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

ఆవిష్కరణలతో..:బీమా పాలసీలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, శాండ్‌బాక్స్‌ కార్యక్రమం ద్వారా వినూత్న ఆవిష్కరణలకు ఐఆర్‌డీఏఐ బీజం పోసింది. 'ఓపీడీ సేవలకు పరిహారం అందించడం, ఇప్పటివరకు మినహాయింపులు ఉన్న వాటినీ పాలసీ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది' అని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ పేర్కొన్నారు కూడా. ఈ నేపథ్యంలో బీమా సుగమ్‌ వేదిక ద్వారా బీమా సంస్థలు పలు వినూత్న పాలసీలను తీసుకొచ్చే వీలుంది. ఇందువల్ల పాలసీదారులను ఆకట్టుకోవడం వల్ల పాటు, వ్యాపారాన్ని పెంచుకునే ఆస్కారమూ బీమా సంస్థలకు కలుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి:RTO ఆఫీస్​కు వెళ్లే పనిలేదు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా 58 సేవలు ఆన్​లైన్​లోనే

మళ్లీ ఆర్థిక మాంద్యం భయాలు.. ఈ జాగ్రత్తలతో ధీమాగా..!

Last Updated :Sep 18, 2022, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details